వైసీపీ లో చేరిన కాపు నాయకుడు ఊసా వెంకటరావు

వైసీపీ లో చేరిన కాపు నాయకుడు ఊసా వెంకటరావు ...


కావలి ,మే 12(అంతిమ తీర్పు - N. సాయి )
కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి నాయకత్వానికి అమలుచేస్తున్న సంక్షేమ  పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో వున్న  34 వ వార్డుకు చెందిన కాపు నాయకుడు  ఊసా వెంకటరావు ఎమ్మెల్యే చేతులమీదుగా  
 ఊసా వెంకటరావు,  ఆయన అనుచరులు పార్టీ కండువాలు కప్పించుకొన్నారు . వైస్సార్సీపీ తీర్ధం తీసుకొన్న ఊసా మాట్లాడుతూ తాను 20 సంవత్సరాలుగా తెలుగుదేశంలో వున్నానని , జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పధకం , కాపులకు అందిస్తున్న సంక్షేమ  పథకాలు నన్ను వైస్సార్సీపీ కి దగ్గర చేశాయన్నారు . ప్రతాపకుమార్ రెడ్డి 2024 లో కూడా ఎమ్మెల్యే అయి హ్యాట్రిక్ సాధించాలని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు . ఎమ్మెల్యే , ఏఎంసీ చైర్మన్ ల మంచితనం , నిబద్ధత నచ్చి తాను వైస్సార్సీపీలోకి వచ్చానన్నారు .
 ఈ చేరికల్ని ఉద్దేశించి  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి మాట్లాడుతూ - లాక్ డౌన్ కారణంగా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితులు వున్నందున ఇంకా చాలామందిని చేర్చుకోలేకపోయామన్నారు . లాక్ డౌన్ అనంతరం పట్టణంలో ఇంకా చాలా మంది  పార్టీలో చేరే అవకాశాలున్నాయన్నారు . ముఖ్యమంత్రి నెరవేరుస్తున్న హామీలకు , సంక్షేమ పథకాల అమలుకు అందరూ ఆకర్షితులవుతున్నారన్నారు . వూసా 34 వ వార్డుకే పరిమితి కాకుండా పట్టణంలోని కాపునాయకుల్ని సమన్వయపరుస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు . కరోనా సమయంలో కష్టపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు , వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు . ఊసా చేరికతో 34 వ వార్డు వైస్సార్సీపీ కి కంచుకోటగా నిలిచిందని , ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ వార్డు వైస్సార్సీపీ ఖాతాలో పడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు . 
ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ - రాబోయే 2024 ఎన్నికల్లో తిరిగి రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి విజయంసాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమన్నారు .  2024 ఎన్నికల్లో ప్రతాపకుమార్ రెడ్డి పై పోటీచేయాలంటే ఎవరయినా భయపడే విధంగా పార్టీని బలోపేతంచేస్తూ ముందుకు తీసుకెళతామన్నారు . జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు ఊసా వెంకటరావు లాంటి ఎంతోమంది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పథకాలకు ఆకర్షితులై వైస్సార్సీపీ లో చేరుతున్నారన్నారు .
కార్యక్రమంలో పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి , మాజీ మండలాధ్యక్షుడు నాయుడు రాం ప్రసాద్ , మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకట నారాయణ తదితర వైస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు , నాయకులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు