డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీ పి.యం.రావు జన్మదిన సందర్భంగా  సేవా కార్యక్రమాలు

డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీ పి.యం.రావు జన్మదిన సందర్భంగా
 సేవా కార్యక్రమాలు


        గూడూరు, మే 1.(అంతిమ తీర్పు ) :                           శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,  టెక్నో మిన్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ మైనింగ్ గ్రూప్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మీపి.యం.రావు నెల్లూరు జిల్లాలోనే  మహా దాతగా పేరు సంపాదించుకున్నారు .
  ట్రస్టు ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్య ,అనారోగ్యంతో బాధపడే వారికి వైద్యం   అందించారు.   చైర్మన్ శ్రీ లక్ష్మి పి.యం రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని నిరాశ్రయులకు ,అనాధలకు, నిరుపేదలకు  బియ్యం ,భోజనం ,పండ్లను పంపిణీ చేశారు. రైతు కూలీలకు భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా ట్రస్ట్ పి ఆర్ వో మల్లవరపు భూషణ్ రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న తరుణంలో లాక్ డౌన్ కారణం గా ప్రజలు ఆర్దికంగా ఇబ్బంది పడకుండా తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్న లక్ష్యంతో డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మిపి.యం.రావు దంపతులు ట్రస్టు ద్వారా teknomin కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ,రాష్ట్ర ప్రభుత్వానికి  20 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.  విజయవాడ పోలీస్ కమిషనర్ కు 15 వేల మాస్కులు 8000 గ్లౌసులు అందించారు.  గూడూరు పోలీస్ శాఖ ,రెవెన్యూ శాఖ కు  మాస్కులు, శానిటైజర్లు అందించారు.  కూరగాయలు పండించే రైతులు నష్ట పోకూడదు అని  ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద రైతుల వద్ద భారీగా కూరగాయలు కొనుగోలు చేసి గూడూరు పట్టణం, గూడూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని నిరుపేదలు రెండు వేల మందికి కూరగాయలను పంపిణీ చేశారు.   గుంటూరు ప్రాంతంలోని సిరిపురం, విజయవాడ ప్రాంతాల్లో కూడా పేదలకు కూరగాయలు పంపిణీ చేసారు.  అలాంటి మహాదాత డాక్టర్ శ్రీమతి శ్రీ లక్ష్మి గారి జన్మదినం పదిమందికి ఉపయోగపడే గా ఉండాలనే సంకల్పంతో ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని బియ్యం, పండ్లు, భోజనాలను పంపిణి చేసామన్నారు.ట్రస్టు ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేసే విధంగా పి.యం రావు దంపతులు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రభు వెంకటరమణారెడ్డి  ట్రస్టు సిబ్బంది ఉదయ్ కిరణ్,  నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు