మామిడి తోటల్లో కాపలదరులకు  ఆహారం పంపిణీ. *ఎం. వి.రావు.ఫౌండేషన్ చేయూత

మామిడి తోటల్లో కాపలదరులకు 
ఆహారం పంపిణీ.
*ఎం. వి.రావు.ఫౌండేషన్ చేయూత.
కోట మే 7.
కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన ఎం.వి.రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోట మండలం 
 చెందోడు గ్రామానికి చెందిన ముప్పవరపు వేంకటేశ్వర రావు గారి జ్ఞాపకార్థం, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి,జాజగణమన రచయత రవీంద్ర నాథ్ టాగూర్ జయంతి,కవి ఆత్రేయ గారీ జయంతి నీ పురస్కరించుకొని గురువారం కోట మండలం లోని మామిడి తోటల్లో పనిచేస్తూ నివసించే నిరుపేద కుటుంబాలకు ,కూలీలకు , ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం,పండ్లు,కూరగాయలు పంపిణీ చేశారు.
గత నాలుగు నెలలుగా వారి యజమానులు ఇచ్చిన పిలుపు మేరకు మండలం లోని గిరిజనులు
మామిడి తోపులో కాపురాలు వుంటూ దుర్బర పరిస్ధితులను అధిగమిస్తున్నా రు.మామిడి తోపులో కాపురాలు వుంటూ అతి చిన్న పిల్లలను రాత్రి అనక పగలనక, విష జీవులను సైతం లెక్క చేయక తోపుల్లో జీవిస్తున్న గిరిజనులను సమీకరించి వారికి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బియ్యం, పండ్లు,కూరగాయలను,ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.
కోట,గుదలి, ఏ ఎస్ ఆర్ పురం, ఇతర ప్రాంతాలలో ఉన్న గిరిజనులకు ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం బియ్యం పండ్లు కూరగాయలను పంపిణీ చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు