జగన్ రెడ్డి నువ్వు మనిషివా ...రాక్షసుడివా ?? ఇది పైశాచికత్వం :ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ

 


జగన్ రెడ్డి నువ్వు మనిషివా ...రాక్షసుడివా ??
ఇది పైశాచికత్వం :ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ


కమీషన్లకు  కక్కుర్తిపడి , మద్యం రేట్లు పెంచి , ప్రజల ప్రాణాలతో  చెలగాటం ఆడుతున్నావు .పేదవాడి కడుపు కొట్టి , నీ జేబు నింపుకునే ప్రయత్నం ...ఆడవాళ్ళ ఉసురు పోసుకోకు !!.రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ చెయ్యటం వల్ల ...ప్రజలు  భౌతిక దూరం పాటించకుండా , పోలీసులు కంట్రొల్ చెయ్యలేక కరోనా వైరస్ బారిన పడితే రాష్ట్ర ప్రభుత్వానిదే  నైతిక బాధ్యత - కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ . అమరావతి రాజధాని కోసం 34 వేల ఎకరాలు ఇచ్చి ,  140 రోజులు గా అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తూ , కరోనా లాక్ డౌన్ వల్ల భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంటిలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మహిళలు , దళిత రైతుల పైన కేసులు పెట్టారు ...అదే అమరావతి రాజధాని ప్రాంతంలో మద్యం షాపుల ముందు ఉదయం నుండి మస్కులు ధరించకుండా , భౌతిక దూరాన్ని పాటించకుండా బారులు తీరిన ప్రజలు !
ఇది పుర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ...


పేదవాడి ఆకలి తీర్చటానికి , అన్నం పెట్టిన ప్రతిపక్షాల పైన కేసులు పెట్టారు ...
ఇది ఎక్కడి న్యాయం ?


ముఖ్యమంత్రి గారు శవాల మీద చిల్లర ఏరుకునే ప్రయత్నాలు మాని ...లాక్ డౌన్ ఎత్తివేసే వరకు మద్యం షాపులు తెరవ కూడదు అని డిమాండ్ !



- ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020