పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ ...............ఆత్మకూరు పట్టణానికి చెందిన షేక్. సంధాని అనే వ్యక్తి డయాలసిస్ తో బాధపడుతు లాక్ డౌన్ వలన ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నారు.  అలాగే అదే ప్రాంతానికి చెందిన తలపనోళ్ళ చెంచయ్య—పెంచలమ్మ అనే గిరిజన వృద్ధ దంపతులు ఎటువంటి అండదండలు లేకుండా వచ్చే పించనతో జీవనం సాగిస్తున్నారు... అలాగే చెంచయ్య కు బయట ప్రపంచం చూసే అవకాశం లేదు అతను ఒక అంధుడు... ఈ విషయాన్ని పట్టణానికి చెందిన ఐక్య ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి కి దృష్టికి తీసుకురావడంతో   ఫౌండేషన్ సభ్యుల సహకారంతో  ఆ రెండు కుటుంబాలకు బియ్యం,నిత్యావసర సరుకులు,కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు  అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి, పొడమేకల ప్రదీప్, రియాజ్,నాయబ్, పారుఖ్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు