ఉపాధి హామీ పనులపై పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

: ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి .       పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హాజరైన అధికారులు



12.5.2020
అమరావతి


తాడేపల్లిలోని పిఆర్ కమిషనర్ కార్యాలయంలో ఉపాధిహామీ పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి  శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం


హాజరైన పంచాయతీరాజ్‌ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సీఎం కార్యదర్శి సాలోమన్ ఆరోఖ్యరాజ్, పిఆర్ కమిషనర్ గిరిజా శంకర్, పిఆర్ ఇఎన్ సి సుబ్బారెడ్డి, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులు.


*మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్...*


- లాక్ డౌన్ తో రాష్ట్రంలో వుండిపోయిన వలస కూలీలకు ఉపాధి పనులు
- కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు ఉపాధి హామీ వర్తింపు.
- జిల్లాల వారీగా వలస కూలీలను గుర్తించి జాబ్ కార్డులను జారీ చేయాలి.
- లాక్ డౌన్ వల్ల పనులు లేక కూలీలు పస్తులు వుండే పరిస్థితి వుండకూడదు.
- ఈ ఏడాది కోటి పనిదినాలను కేంద్రం అదనంగా ఎపికి కేటాయించింది.
- పలు జిల్లాల్లో ఉపాధి హామీతో గ్రామీణ కూలీలకు పనులు కల్పిస్తున్నాం.
- కష్టసమయంలో ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలి.
- ఇప్పటికే వివిధ జిల్లాల్లో వున్న వలస కూలీలను గుర్తిస్తున్నాం.
- వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఇక్కడే వుండిపోతున్నారు. 
- వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా వుంది.
- రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు కూడా ఉపాధి హామీని వర్తింప చేస్తున్నాం.
- దీనితో ఎక్కువ మందికి పనులు లభిస్తాయి.
- అటు రైతులకు కూడా మేలు జరుగుతుంది.
- ఇంజనీరింగ్ శాఖల అధికారులు కూడా ఉపాధి హామీకి ప్రాధాన్యత ఇవ్వాలి


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు