మానవీయ కోణంలో రాష్ట్రంలో రెడ్ క్రాస్ సేవలు ;ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్

మానవీయ కోణంలో రాష్ట్రంలో రెడ్ క్రాస్ సేవలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్
రేపు.ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం


ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ బ్రాంచ్ అధ్యక్షుడు శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ రెడ్‌క్రాస్ సభ్యులు, వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.  అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ఐసిఆర్‌సి) వ్యవస్థాపకుడు, మొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జీన్ హెన్రీ డునాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 8 న ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని,  రెడ్ క్రెసెంట్ డే లను జరుపుకోవటం అనవాయితీగా ఉంది.  అంతర్జాతీయ రెడ్‌క్రాస్ ఉద్యమ సూత్రాల వార్షిక వేడుకగా ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం నిర్వహిస్తుండగా, రెడ్ క్రాస్ సంస్ధ ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్ధగా ఖ్యాతిని గడించింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతి సంవత్సరం మానవతా ఇతివృత్తంతోనే ఈ శుభదినాన్ని జరుపుకుంటుంది. భారతదేశానికి ప్రపంచ రెడ్ క్రాస్ డే  2020  ప్రత్యేకమైనది, ఎందుకంటే 1920 లో స్థాపించబడిన భారత రెడ్ క్రాస్ సొసైటీ యొక్క శతాబ్ది సంవత్సరాన్ని ఇది సూచిస్తుంది. 
ప్రపంచాన్ని కరోనా మహమ్మరి బాధిస్తున్న తరుణంలో ఈ సంవత్సరం “వాలంటీర్ల కోసం చప్పట్లు” థీమ్ తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనాపై పోరులో మొదటి వరుస యోధులుగా ఉన్న లక్షలాది మంది రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను ఈ సందర్భంగా గవర్నర్ ప్రస్తుతించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ఒక శక్తివంతమైన సంస్థగా ప్రజలకే సేవలు అందిస్తుందని, ఇది ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటానికి కట్టుబడి ఉందని మాననీయ గవర్నర్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం కృషి, విశాఖపట్నంలో తాజాగా జరిగిన గ్యాస్ లీకేజ్ సంఘటనతో బాధపడుతున్న ప్రజల సహాయక చర్యలు ఇలా,,, వాలంటీర్లు పోషించిన పాత్రను ఎంచదగినదని గవర్నర్ ప్రశంసించారు. సహాయం అవసరమైన ప్రజలకు రెడ్ క్రాస్ ఎపి స్టేట్ బ్రాంచ్ నిరంతరం అందుబాటులో ఉందన్నారు. 
సంస్థ కోసం వాలంటీర్లుగా పనిచేయడానికి ఇష్టపడే వారిని చేర్చుకునేందుకు ‘టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1234’ తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని,  ఎపి రెడ్ క్రాస్ రాష్ట్రవ్యాప్తంగా 21 కమ్యూనిటీ కిచెన్‌లను నిర్వహించి 6.2 లక్షలకు పైగా ఫుడ్ ప్యాకెట్లు, 215 టన్నుల బియ్యం, కూరగాయలు, డ్రై రేషన్, 89,000 జతల చేతి తొడుగులు, 2.6 లక్షల ఫేస్ మాస్క్‌లను పేద, నిరాశ్రయులు, బలహీన వర్గాలకు పంపిణీ చేసిందని బిశ్వ భూషన్ వివరించారు.  వివిధ ప్రభుత్వ విభాగాలు, ఇతర ఎన్జిఓల సహకారంతో  రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలను అందించడం ద్వారా కోవిడ్ -19 ఐసోలేషన్ సెంటర్లలో పెద్ద ఎత్తున సహాయకులుగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ తెలిపారు.  రాష్ట్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఉద్యమానికి బలోపేతం చేయటంలో సంస్ధ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి ఎకె ఫరీడా బృందం మంచి పనితీరును చూపుతుందని గవర్నర్ ప్రశంసించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు