రుయాలో వైద్య వసతులు మరింత మెరుగ్గా ఉండేలా చూడాలి.. జిల్లా కలెక్టర్

 


రుయాలో వైద్య వసతులు మరింత మెరుగ్గా ఉండేలా చూడాలి.. జిల్లా కలెక్టర్


తిరుపతి, మే 04 : రుయా ఆసుపత్రి కోవిడ్ కు ప్రాధాన్యత నేపధ్యంలో ఆసుపత్రిలో చేపట్టాల్సిన వైద్య వసతులు పై జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇప్పటికే మెడిసిన్ వార్డు లో కోవిడ్  150 పడకలు వున్నాయని, మరో 200 పాత మెటర్నేటీ సిద్దంగా ఉందని, అలాగే ఒకటి నిండితే తరువాత మరోకటి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రుయాలో మార్పు చేయదలచిన వార్డులో పనులు పూర్తి కావాలని వసతులు టాయిలెట్ లు, ఆక్సిజన్ లైన్ లు, బెడ్లు వంటివి సిద్ధంగా ఉండాలని సూచించారు. పిపిఐలు, ఎన్95 మాస్కులు అవసరాలను అడిగి తెలుసుకున్నారు.


రుయా సూపరినెంట్ భారతి వివరిస్తూ ఎం.ఆర్.ఐ, సిటీ స్కాన్ పనిచేస్తున్నాయని నేడు ఒపి ప్రారంభించామని 382 మంది రోగులకు వైద్య సేవలు అందించామని అందులో 100 మంది కి కోవిడ్ టెస్టులు చేస్తున్నామని వివరించారు. ఇన్ పేషేంట్లను 22 మందిని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రలకు పంపామని తెలిపారు. ఓపి పేషంట్ల కోవిడ్  రిజల్టు వచ్చే వరకు పేషేంట్ల అటెండర్స్ వసతి కోసం ధార్మిమిటరీ కావాలని ,  నేటి వరకు 32 మంది కొత్తగా  డాక్టర్లు విధుల్లో చేరారని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ తో ఆక్సిజన్ సరిపోతుందని వివరించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ లు కావాలని కోరారు.


ఈసమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పృద్వి తేజ్, ఆర్.ఎం.ఓ. ఇబి దేవి, సరస్వతి, ఏపీఎం ఐడిసి ఇఇ ధనంజయ రెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బాల ఆంజనేయులు , తదితరులు పాల్గొన్నారు.


 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు