ఉపాధి కోల్పోయి జీవనాధారం లేక దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటామన్న నాయి బ్రాహ్మణులు

ఉపాధి కోల్పోయి జీవనాధారం లేక దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటామన్న నాయి బ్రాహ్మణులు .....


కావలి ,మే11 (అంతిమ తీర్పు - N.సాయి )


కరోనా మహమ్మారి వలన గత యాభై రెండు రోజులుగా జీవనోపాధి కోల్పోయి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని  నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాల గురుస్వామి తెలియజేశారు . కావలి ప్రెస్ క్లబ్ లో  సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో         ఆయన మాట్లాడుతూ గత 52 రోజులుగా తమ జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని శుభకార్యలు లేక సెల్యూన్ షాపులు మూసి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఈ విషయాలన్నీ కావలి సబ్ కలెక్టర్ మరియు  ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి తమ మా సమస్యలను తీసుకెళ్లామని మా ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ లో షాపులకు అద్దె  రద్దు చేయాలని ప్రతి సెల్యూన్ షాపుకు కరెంటు బిల్లులు రద్దు చేయాలని అలాగే ప్రతి సెల్యూన్ షాపుకు  ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు . సెల్యూన్ షాపులకు అనుమతి ఇస్తే మేము సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటేషన్ మరియు ఇతర జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాల గురుస్వామి మరియు న్యాయ బ్రాహ్మణుల సంఘం నాయకులు ద్రోణాదుల వెంకట్రావు 
 పాల్గొన్నారు .


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు