ప్రభాకరాచారి వైసిపికి చేసిన సేవలు మరువలేనివి, --వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి వెల్లడి

ప్రభాకరాచారి వైసిపికి చేసిన సేవలు మరువలేనివి,
--వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి వెల్లడి


మంత్రాలయం,మే,16 (అంతిమతీర్పు):-మంత్రాలయం నియోజకవర్గంలోని 


విశ్వబ్రాహ్మనఅయినా  ప్రభాకరాచారి వైసిపికి చేసిన సేవలు మరువలేనివి అని వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి అన్నారు. శనివారం ప్రభాకరాచారి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆదేశాల మేరకు రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు సంతాప సభనిర్వహించామన్నారు.ప్రభాకరాచారి మంత్రాలయం గ్రామానికి మాజీ సర్పంచ్ గా శ్రీ మఠం షాపింగ్ కాంప్లెక్స్ యూనియన్ అధ్యక్షులుగా సేవలు అందించారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బి.వి. మోహన్ రెడ్డి కాలంలో ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి అని తెలిపారు. రాంపురం రెడ్డి సోదరుల నేతృత్వంలో వైసిపి పార్టీ బలోపేతానికి కృషి చేశారని ఇటీవల అనారోగ్యంతో మరణించడం పార్టీకి తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొంత సేపు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టి. భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ నాయకులు జనార్దన్ రెడ్డి,వీరారెడ్డి, యం.ఆర్విరెడ్డి ,మల్లికార్జున, హోటల్ పరమేష్ స్వామి,జగదీష్ స్వామి, శివకుమార్,ఆకారం ప్రహ్లాద, బద్రీనాథ్ శెట్టి, దామోదర గుప్త, దర్జీ ప్రకాష్,యస్. శ్రీనివాసులు,బసవరాజు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020