సీతారామపురం పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటు తుపాకీ... .

అక్రమాలకు అడ్డాగా ఉదయగిరి.. పోలీసులకు దొరికిన నాటు తుపాకీ. బుల్లెట్లు.... 
 నిద్రావస్థలో నిఘా విభాగం
 ఉదయగిరి... రెండు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా, నెల్లూరు జిల్లాకు చిట్టచివరి ప్రాంతం గా ఉన్న ఉదయగిరి పరిసర ప్రాంతాలు అక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. వన్యప్రాణుల వేట, ఎర్రచందనం నరికివేత, లక్షల్లో పేకాట, నాటు సారా తయారీ విచ్చలవిడిగా సాగుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా నిఘా వ్యవస్థ మాత్రం నిద్రావస్థలో ఉందన్న ఆరోపణలు ఎదుర్కుంటూ ఉంది. ఆదివారం సీతారామపురం పోలీసులకు ఒక నాటు తుపాకీ 16 రౌండ్ల బుల్లెట్లు లభ్యం కావడంతో ఈ ప్రాంతంలో అక్రమార్కుల సంచారం విరివిగా జరుగుతుందన్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఉదయగిరి ప్రాంతం వెలిగొండ నల్లమల అడవులలో అంతర్భాగంగా వుంది. అపారమైన ఎర్రచందనం వృక్షాలు లు, అంతకంటే ఎక్కువగా సంచరించే వన్యప్రాణులు ఈ ప్రాంతానికి సొంతం. అంతేకాకుండా దట్టమైన అడవి ప్రాంతం కావడం నిఘా అంతగా లేకపోవడం ఇలాంటి కారణాలతో తో అడవులలో పేకాట స్థావరాలు, నాటుసారా కర్మాగారాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిత్యం అడవుల్లో సంచరిస్తూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిన అటవీశాఖ అధికారులు కార్యాలయాల కే పరిమితం అవుతుండడంతో అటవీశాఖ తనిఖీ కేంద్రాలు కూడా అలంకారప్రాయంగా మారిపోయాయి. ప్రస్తుత లాక్ డౌన్లోడ్ పరిస్థితుల్లో ప్రజలు విలవిలలాడి పోతున్నా అక్రమార్కులకు మాత్రం కలిసొచ్చేలా మారిపోయింది. సీతారామపురం మండలం లో ఇప్పటికి మూడు సార్లు లు నాటుసారా తరలించే వ్యక్తులను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం, ఉదయగిరి మండలం కొండ కింద పల్లెల్లో పోలీసులు తనిఖీ చేసి పేకాట స్థావరాలుగా ధ్వంసం చేయటం, తాజాగా సీతారామపురం పోలీసులకు ఒక నాటు తుపాకీ 16 రౌండ్ల బుల్లెట్లు లభ్యం కావడం ఈ ప్రాంతాన్ని కలవరపెడుతోంది, తుపాకి ఉపయోగించిన వాళ్ళు వన్యప్రాణుల వేట కోసం వచ్చారా? లేక ఎర్రచందనం స్మగ్లర్ల అనే విషయం అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చి మూడు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఉదయగిరి సీతారాంపురం మండలాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు