వింజమూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

వింజమూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ


వింజమూరు, మే 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో శుక్రవారం సాయంత్రం 9 మందికి 7 లక్షల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. స్థానిక వెలుగు కార్యాలయం సమావేశ మందిరంలో ఈ చెక్కులను భాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వై.సి.పి కన్వీనర్ పల్లా.కొండారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ప్రజల సం క్షేమమే ధ్యేయంగా ఆరోగ్యశ్రీ పధకమును ప్రవేశపెట్టారన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి ఆశయాలను కొనసాగిస్తుండటం గర్వించదగిన విషయమన్నారు. తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ సి.యం రిలీఫ్ ఫండ్ చెక్కులు భాధిత కుటుంబాలకు ఎంతగానో ఊరటనిస్తాయన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధికంగా లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు సి.యం. సహాయనిధి చెక్కులు వారి కుటుంబాల ఆర్ధిక పరిస్థితుల మెరుగుకు దోహదపడతాయన్నారు. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు సహకారంతో భాధితులకు చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సొసైటీ చైర్మన్ మద్దూరి.చిన్నిక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో సి.యం.రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి, పోరెడ్డి.జగన్ రెడ్డి, జక్కం.మోహన్ రెడ్డి, లెక్కల.సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు