ముమ్మరం గా లేవుట్ నిర్మాణ పనులు*

*ముమ్మరం గా లేవుట్ నిర్మాణ పనులు*
వరికుంటపాడు ,:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా రూపొందించిన ఇంటి నివేశన స్థలాలకు సంబంధించి,  వరికుంటపాడు మండలం లో లేవుట్ నిర్మాణ పనులు ముమ్మరo గా సాగుతున్నాయి. దారిద్ర్య రేఖ కు దిగువున ఉన్న కుటుంబాలకు చేయూత ని అందించే దిశగా ఈ పనులు జోరు గా సాగుతున్నాయి. శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తో అనువైన ప్రాంతాలను గుర్తించి లేవుట్ ల ఏర్పాటు చేయడం తో బాటు భూమి ని చదును చేసి ప్రొక్లైన్లు, ట్రాక్టర్ లు సాయం తో మట్టిని లేవుట్ లలో నింపి చదును చేస్తున్నారు. రోడ్డు రోలర్ సాయం తో నాణ్యత గా ప్లాట్ లను ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేసారు. వరికుంటపాడు మండలం లోని 24 పంచాయతీ లలో 80 శాతం  ఈ పనులు పూర్తి కానున్నాయి. తూర్పు బోయమడుగుల పంచాయతీ  లోని అలివేలు మంగాపురం, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ లలో ఏర్పాటు చేసారు. అలాగే కాంచెరువు, ఇస్కపల్లి, జడదేవి, గువ్వడి తదితర గ్రామాల్లో ఈ పనులు వేగవంతం అయ్యాయి. ఈ పరిణామాలతో ప్రభుత్వం అందించే ఈ ఇంటి నివేశన స్థలాలు తమకు ఉచితంగా అందనుండడం సంతోషంగా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు