వింజమూరు మాజీ జడ్.పి.టి.సి ' పులిచర్ల ' దాతృత్వo

*వింజమూరు మాజీ జడ్.పి.టి.సి ' పులిచర్ల ' దాతృత్వo వింజమూరు, మే 17 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మాజీ జడ్.పి.టి.సి సభ్యులు, పులిచర్ల.నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పులిచర్ల.వెంకట నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు వలస కార్మికుల పట్ల ఆదివారం నాడు తమ దాతృత్వమును చాటుకున్నారు. వ్యాపార రీత్యా తరచూ గుంటూరుకు వెళుతున్న పులిచర్ల. నారాయణరెడ్డి స్వతహాగా నెల్లూరీయులను అక్కడ కూడా ఆదరిస్తూ వారికి వ్యాపారపరంగా చేయూతనిస్తూ బాసటగా నిలుస్తుంటారనే పేరుంది. అయితే ప్రస్తుతం కరోనా విపత్తు సమయంలో లాక్ డౌన్ కారణంగా గుంటూరులోనే ఉండిపోయిన పులిచర్ల.నారాయణరెడ్డి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 200 మంది వలస కార్మికులకు కాజా టోల్ గేట్ వద్ద ఎన్.హెచ్-16 రోడ్డులో ఆహార పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చరవాణి ద్వారా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాలు సాహసోపేతమైనవిగా నారాయణరెడ్డి అభివర్ణించారు. వలస వాసులకు ఆసరాగా నిలిచిన ఈ ఆహారం అందించే కార్యక్రమంలో పులిచర్ల. అరుణకుమారి, పులిచర్ల. పృద్ధ్వీరెడ్డి, అంకినపల్లి.పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు