వింజమూరులో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ

వింజమూరులో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ


వింజమూరు, మే 2 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): మేజర్ పంచాయితీ అయిన వింజమూరులో శనివారం నాడు కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా హైపోక్లోరైడ్ ద్రావణమును పంచాయితీ సిబ్బంది ప్రత్యేక ట్రాక్టర్ల ద్వారా పిచికారీ చేశారు. బంగ్లాసెంటర్ నుండి బస్టాండు కూడలి, పంచాయితీ బస్టాండు, నడిమూరు, కొత్తూరు, యర్రబల్లిపాళెంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ద్రావణమును స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మారుమూల ప్రాంతాలకు సైతం వ్యాపించిందన్నారు. అందులో భాగంగా ఈ వైరస్ నిర్మూలనకు గానూ పారిశుద్ద్య పనులను రెట్టింపు స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా పంచాయితీ అధికారి, స్థానిక యం.పి.డి.ఓ ఆదేశాల మేరకు నిరంతరం ముమ్మరంగా పారిశుద్ద్య పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు నాగిరెడ్డి, నరేంద్ర, పంచాయితీ సిబ్బంది బువ్వన.వెంకటేశ్చర్లు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు