వింజమూరు క్వారంటైన్ లో భోజనాలు పరమ అధ్వాన్నం

వింజమూరు క్వారంటైన్ లో భోజనాలు పరమ అధ్వాన్నం


మీ ఇళ్ళలో మీరు కూడా ఇలాగే తింటున్నారా... మాకు వచ్చే భోజనాలు మీరూ తినండి...ఏ.సి గదులు వీడి వింజమూరు క్వారంటైన్ సెంటరును పరిశీలించండి... 


వింజమూరు, మే 14 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని శ్రీ రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో భోజనాలు సక్రమంగా లేవని క్వారంటైన్ సెంటర్లో ఉన్న పలువురు తమ ఆవేదనను వెలిబుచ్చారు. కూలీ నాలీ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన మేము అక్కడ పనులు లేకపోవడంతో తిరిగి వచ్చామన్నారు. అధికారులు తమను క్వారంటైనుకు తరలించారని, ప్రస్తుత కరోనా వైరస్ నేపధ్యంలో తాము కూడా అధికారులకు సహకరిస్తున్నామన్నారు. కానీ భోజనాలు సరిగా లేవని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఏమవుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఆదేశాలు జారీ చేయడం చాలా సులభతరమని, ఇప్పటికే మమ్మల్ని అంటరాని వారీగా చూస్తున్నారని, వింజమూరు క్వారంటైన్ సెంటరును తనిఖీ చేస్తే మీకు అర్ధమవుతుందని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు