బత్తాయిలు ఎగుమతి కి మార్గం సుగమం

బత్తాయిలు ఎగుమతి కి మార్గం సుగమం
వరికుంటపాడు ,మే 13:
మండలం లో సాగవుతున్న బత్తాయి పంట కు ఎట్టకేలకు రవాణా సౌకర్యం సుగమం అయింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రైతులు ధర లాభసాటి గా ఉన్న సమయం లో కరోనా భూతం వెంటాడి లొక్డౌన్ రూపం లో ఎగుమతులు నిలిచిపోయే విదంగా చేసింది. ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి పండించిన సాగు సుమారు రెండు నెలలుగా రవాణా సౌకర్యం లేక నేల రాలిపోతుండేవి. ప్రభుత్వం పండ్ల తోటల పైన ఆంక్షలు సడలించడం తో కొనుగోలుదారులు ముందుకి వస్తున్నారు. ధర గిట్టుబాటు కాకపోయినా కాయలను చెట్లలోనూ ఉంచలేక అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. టన్ను సుమారు 15 వేలు లోపే ధర పలకడం తో చేసేది లేక రైతులు పండ్లని అముకుంటున్నారు. ఉదయగిరి మండలం దాసరిపల్లి కి చెందిన కొందరు దళారులు  బత్తాయి లను కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రము లోని బెంగళూరు, మైసూర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని మండలం లోని కాంచెరువు, పెద్దిరెడ్డి పల్లి, రామాపురం, పామూరు పల్లి, తూర్పు రొంపిదొడ్ల కి చెందిన రైతులు పేర్కొంటున్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు