ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో సోషల్ డిస్టెన్స్ కు చెల్లుచీటీ ..

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో సోషల్ డిస్టెన్స్ కు చెల్లుచీటీ


.. వింజమూరు, మే 8 (రిపోర్టర్- దయాకర్ రెడ్డి): ప్రజలు సమదూరం పాటిస్తేనే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చునని ప్రభుత్వాలు, అధికారులు పదే పదే గొంతు చించుకుని ప్రకటనలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో పలుచోట్ల ప్రజలకు ఏ మాత్రం చెవికెక్కడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దారిన పోయే కరోనాను తమ దగ్గరకు ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా బ్యాంకుల వద్ద ఖాతాదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులలో మాత్రం కరోనా నిబంధనలు అటకెక్కుతున్నాయి. వింజమూరు, చాకలికొండలలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులలో ఈ పరిస్థితులు బ్యాంకుల సిబ్బంది నిర్లక్ష్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. బ్యాంకుల వద్ద చేతులు శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్లు, సబ్బులు, డెటాల్ వంటి వాటిని సిద్దంగా ఉంచాలని ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఖాతాదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల వద్ద మాత్రం కరోనా నియంత్రణ చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు