మధ్యం షాపుల వద్ద నిబంధనలు పాటించాలి :- వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి

మధ్యం షాపుల వద్ద నిబంధనలు పాటించాలి :- వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి


వింజమూరు, మే 6 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): మద్యం షాపుల వద్ద అటు నిర్వాహకులు గానీ, ఇటు మద్యం ప్రియులు కానీ ఖచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలను పాటించాల్సిందేనని వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం నాడు ఆయన పలు మద్యం షాపుల ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాఫు. ఎస్.ఐ వాహనాన్ని గమనించి మద్యం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా ఉన్న మందుబాబులు పరుగులందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ విషయంలో షాపుల నిర్వాహకులు కరోనా వైరస్ కట్టడి లక్ష్యంగా భాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినా కొన్ని నియమ నిబంధనలతో పాటు పరిమితులను కూడా తెలియజేయడం జరిగిందన్నారు. షాపుల ముందు భాగంలో సమదూరం పాటించే విధంగా మార్కింగులు వేయాలని నిర్వాహకులకు సూచించారు. మాస్కులు ధరించిన వారికే మద్యం ఇవ్వాలన్నారు. మద్యం కొనుగోలు సమయంలో గుంపులు గుంపులుగా ఉండకుండా కౌంటర్ల వద్ద ఉంటున్న నిర్వాహకులే అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం ప్రియులు కూడా గతంలో మాదిరిగా మద్యం సేవించి రోడ్లుపై సంచరించరాదన్నారు. పూటుగా మద్యం సేవించి వీధుల వెంబడి తిరగడం, ద్విచక్రవాహనాలలో డబుల్, త్రిబుల్ వెళ్ళడం వాంటివి ఉపేక్షించబోమని ఎస్.ఐ బాజిరెడ్డి స్పష్టం చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు