నేడు బ్రాహ్మణులకు చేయూతనివ్వనున్న గణపం.బాలక్రిష్ణారెడ్డి

నేడు బ్రాహ్మణులకు చేయూతనివ్వనున్న గణపం.బాలక్రిష్ణారెడ్డి


వింజమూరు, మే 4 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరులోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం వద్ద బ్రాహ్మణ పండితులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నామని వింజమూరు మాజీ మండలాధ్యక్షులు, వై.సి.పి జడ్.పి.టి.సి అభ్యర్ధి గణపం.బాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి మాజీ జడ్.పి.టి.సి సభ్యురాలు గణపం.సుజాతమ్మలు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మారుమూల ప్రాంతాలకు సైతం సోకడం విషాదకరమన్నారు. ఈ వైరస్ నియంత్రణలో భాగంగా మన దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలు పతనమవుతున్నప్పటికీ ప్రజల సం రక్షణ, సం క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు లేకపోవడంతో పలు ప్రాంతాల పేదలు పస్తులుండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అందులో భాగంగా ఇటీవల 3 టన్నుల కూరగాయలను తమ స్వంత నిధులతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దైవత్వం ఫరిఢవిల్లే ఆలయాలకు కూడా లాక్ డౌన్ నిబంధనలు వర్తించడంతో అర్చకుల జీవనగమనం ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన పినతండ్రి గణపం.ఓబులురెడ్డి జ్ఞాపకార్ధం ఆయన సతీమణి సౌజన్యంతో బ్రాహ్మణులకు నిత్యా వసర సరుకులను పంపిణీ చేయనున్నామన్నారు. ఈ కరోనా కష్టకాలంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు వింజమూరు మండలంలో పలువురు దాతలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కూరగాయలు, వంట సరుకులు అందజేయడం శుభపరిణామని ఈ సందర్భంగా గణపం.బాలక్రిష్ణారెడ్డి దాతలందరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలియజేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు