వింజమూరులో ఇంటింటికీ సామాజిక ఫించన్లు పంపిణీ

వింజమూరులో ఇంటింటికీ సామాజిక ఫించన్లు పంపిణీ వింజమూరు, మే 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో శుక్రవారం నాడు మే 1 వ తేదీని పురస్కరించుకుని వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి అర్హులైన లబ్ధిదారులకు సామాజిక ఫించన్లను పంపిణీ చేశారు. గ్రామ పంచాయితీలోని 5 సచివాలయాల పరిధిలో 2265 మంది ఫించను దారులు ఉండగా ఉదయం 6 గంటల నుండి వాలంటీర్లు ఫించన్ల జాబితాలను చేత పట్టుకుని లబ్ధిదారుల నివాసాల వద్దకు చేరుకున్నారు. కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని ఆదేశాల మేరకు మాస్కులు, గ్లౌజులు ధరించిన వాలంటీర్లు ఎప్పటికప్పుడు శానిటైజర్లతో చేతులు శుభ్రపరచుకుంటూ ఉత్సాహంగా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బి.సి కాలనీ, గంగమిట్ట, పాతూరు, నడిమూరు, యర్రబల్లిపాళెం ప్రాంతాలలో జరుగుతున్న ఫించన్లు పంపిణీని పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. పంచాయితీ పరిధిలోని 5 సచివాలయాలకు సంబంధించి 97 మంది వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సామాజిక ఫించన్లు పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు