ఎల్జీ పాలిమర్స్ బాధితులను గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 09-05-2020,
అమరావతి.


ఎల్జీ పాలిమర్స్ బాధితులను గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


అమరావతి, మే, 09 ;  విశాఖ గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రజల కష్టాలపై క్షణాల్లో స్పందించే మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎవరికీ ఇబ్బంది కలగదని మంత్రి పేర్కొన్నారు.  మరో 48 గంటలు దాటితే విశాఖలో సాధారణ పరిస్థితులునెలకొంటాయని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల ఐదు గ్రామాలలో బాధితులను గుర్తించేందుకు డోర్ టూ డోర్ సర్వే చేస్తామని మంత్రి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి చక్కబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. ప్రమాదం జరిగిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. 



*రాష్ట్రంలో 1446 మద్యం షాపులను తగ్గించగలిగాం : మంత్రి గౌతమ్ రెడ్డి*


ఆర్థిక లోటు, అదనంగా కరోనా కష్టాలు, ఊహించని విపత్తులు వచ్చినా మద్యపాన నిషేధం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళుతోందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934 దుకాణాలకు తగ్గించగలిగామని మంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు. మద్యపాన నిషేధాన్ని ఎన్నికల హామీలలో కాకుండా చేతలలో చూపించగలిగామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం  13 శాతం మద్యం దుకాణాలను మూసివేసిందని మంత్రి తెలిపారు. మద్యం ధరలను అత్యధికంగా పెంచి కొనలేని విధంగా, తద్వారా తాగకుండా  చేయడాన్ని దశలవారీగా అమలు చేసే దిశగా  అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ను లిక్కర్ ఫ్రీ (మద్యంలేని) రాష్ట్రంగా మార్చడం ఖాయమని మంత్రి తెలిపారు.



---------------------------


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు