మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ దాతృత్వంతో కూరగాయలు పంపిణీ

             గూడూరు  మే 3 (అంతిమ తీర్పు) ::  కరోనా లాక్ డౌన్ లాంటి కష్ట కాలంలో గూడూరు పురపాలక ప్రజలకు ఆపద్బాంధవుడిగా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నిలిచి వేలాది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడి గుడ్డు లు పంపిణీ చేస్తూ తన దాతృత్వాని చాటుతున్నారు, ఈనేపథ్యంలోఆదివారంనాడుగూడూరు పట్టణంలోని బీసీ కాలనీ నందు 400 కుటుంబాలకు  కూరగాయలను అందించిన మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ దాతృత్వంలో పంపిణీ చేశారు,గూడూరు పట్టణం  32 & 33 వార్డు బి సి కాలనీ నందు నివసిస్తున్న పేద కుటుంబాలకు కూరగాయలు(టమోటా,వంకాయి క్యాబేజీ, మామిడికాయ,పచ్చిమిర్చి,మరియు ఎర్రగడ్డల)ను 400 కుటుంభాలకు పంపిణి చేయమని వార్డు వాలంటర్లకుమాజీ శాసన సభ్యులు పాశం.సునీల్ కుమార్అందజేసారు,అనంతరం  విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ
కరోనా లాక్ డౌన్ వలన ప్రజలు ఎదుర్కోనుచున్న ఇబ్బందుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు  ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి ప్రభావాన్ని దృష్టి లో పెట్టుకుని లాక్ డౌన్ పెంచిన ప్రధానమంత్రి  కి ధన్యవాదాలు తెలిపారు.ఇలా ముందస్తు జాగ్రత్తలు నరేంద్ర మోడీ  తీసుకున్నారు కాబట్టే ప్రపంచoలోని దేశాలు కన్నా మన భారతదేశంలో ఈ కరోనా ప్రభావం తక్కువుగా ఉన్నదని తెలిపారు.ఈ కరోనా వైరస్ నివారణకు మందులు లేవు కనుక దీనికి మనం ఇంటి నుండి బయటకు తిరగకుండా స్వీయ నిర్భంధం చేసుకోవాలని తెలిపారు.గూడూరులో పుట్టి పెరిగినందుకు తనవంతు సాయంగా పేదలకు ఈ సేవాకర్యక్రమాలను చేస్తున్నాని, అలాగే ఈ రోజు గూడూరు నియోజకవర్గంలో పార్టీలకతీతముగా ప్రజలకు సేవచేస్తున్న దాతలకు, స్వచ్చంద సేవాసంస్థలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిచేస్తున్నాని తెలిపారు.కరోనా వైరస్ భారిన పడకుండా ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంటూ, బౌతికదూరం పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు.చెంచురామయ్య, పట్టణ అధ్యక్షులు పులిమి.శ్రీనివాస రావు,టౌన్ మైనారిటీ సెల్ అద్యక్షులు రహీమ్,ప్రధాన కార్యదర్శి నరసింహులు,మాజీ కౌన్సిలర్లువాటంబేటి.శివకుమార్,కొణతం.సురేష్,సరస్వతమ్మ,నాయకులు ఛాన్ బాషా,జబ్బార్,ఉమర్, మోహన్,హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు