గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ ప్రెస్ మీట్

గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ ప్రెస్ మీట్


     గుంటూరు, మే 1,(అంతిమ తీర్పు) :                                 కంటైన్మేంట్ జోన్లలో ఇప్పటి వరకు కొత్త కేసులు నమోదు కాలేదని, గడచిన ఐదు రోజులలో 680 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం 11 మందికి  మాత్రమే పాజిటివ్ గా నమోదు అయ్యాయన్నారు.   కంటైన్మేంట్ ఏరియాలలో ప్రజల సహకారం చాలా బాగుందన్నారు.  పాజిటివ్ గా నిర్దారణ అయి చికిత్స అనంతరం నెగిటివ్ గా రిపోర్టు వచ్చి ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయిన వారు ఇంటి వద్ద 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో వుండాలని తెలిపారు. గుంటూరు నగరంలోకి ఎవరు రాకుండా, నగరంలోని వారు బయటి ప్రాంతాలకు వెళ్ళకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు.  రెడ్ జోన్ ఏరియాలలో ఇప్పుడు వున్న సిసి కెమెరాలకు అదనంగా 200 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి రహదారులపై తిరిగే వాహనాలను సిజ్ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 4650 వాహనాలను సిజ్  చేయడం జరిగిందన్నారు.  లేని విషయాలు ఉన్నట్లుగా ప్రచారం చేసిన ఒక ఆన్ లైన్ న్యూస్ ఛానల్ పై కేసు పెట్టడం కూడా జరిగిందని అర్బన్ ఎస్పీ తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు