తిరివిధి ప్రసాద్ సేవలు ఆదర్శనీయం ... ఎమ్మెల్యే రామిరెడ్డి

తిరివిధి ప్రసాద్ సేవలు ఆదర్శనీయం ... ఎమ్మెల్యే రామిరెడ్డి


కావలి ,మే14 (అంతిమ తీర్పు -N. సాయి )
పట్టణంలోని కచేరిమిట్ట 20,27 వార్డు సచివాలయంలో గురువారం నాడు వార్డు వైసిపి నాయకులు తిరివిధి ప్రసాద్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు సచివాలయ సిబ్బంది కి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ మన్నె మాల సుకుమార్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు నగదు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు వాలంటీర్ వ్యవస్థ సేవలు ఎంతో అభినందనీయమని వారి సేవలను కొనియాడారు . అలాగే కరోనా నేపథ్యంలో నెలకొన్న లాక్ డౌన్ కారణంగా ఎందరో వలస కూలీలు నిరుపేదలు పలు ఇబ్బందులకు గురయ్యారని ఈ విషయం గుర్తించిన వైసిపి నాయకులు కార్యకర్తలు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు వారిని ఆదరించి ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈరోజు తిరి వీధి ప్రసాద్ వారి మిత్రబృందం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి,  మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ , పట్టణ యువత అధ్యక్షులు కిశోర్ గుప్తా, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు