ప్రజారంజక పాలన అందిస్తున్న సి.యం వై.యస్.జగన్ : పూనూరు.రామ మనోహర్ రెడ్డి. వింజమూరు, జూన్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన యేడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సం క్షేమ ఫలాలను అందిస్తూ ప్రజారంజక పాలనను సాగించడం అభినందనీయమని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పూనూరు.రామ మనోహర్ రెడ్డి కొనియాడారు. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి యేడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా నెల్లూరుజిల్లా చేజర్ల మండలంలోని తన స్వగ్రామమైన మడపల్లి నుండి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసిం హస్వామి దేవస్థానంకు పూనూరు.రామ మనోహర్ రెడ్డి తన సన్నిహితులతో నిరంతర పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 15 వ తేదీ సోమవారం ఉదయం నుండి ప్రారంభించిన పాదయాత్ర మంగళవారం రాత్రికి వింజమూరుకు చేరుకుంది. వింజమూరులో వై.సి.పి నేతలు మాజీ మండలాధ్యక్షులు గణపం.బాలక్రిష్ణారెడ్డి, గణపం.క్రిష్ణకిరణ్ రెడ్డిలు, మండల మాజీ వై.సి.పి కన్వీనర్లు మలిరెడ్డి.విజయకుమార్ రెడ్డి, గువ్వల.క్రిష్ణారెడ్డిలు రామ మనోహర్ రెడ్డి బృందం సభ్యులకు స్థానిక శివాలయం వద్ద ఘన స్వాగతం పలికి బంగ్లాసెంటర్ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనూరు.రామ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వై.యస్.జగన్ మోహన్ రెడ్డి యేడాది పాలనలో తన మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను 90 శాతం పూర్తి చేసి దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన అరుదైన ఘనతను దక్కించుకున్నారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా, మాట తప్పని-మడమ తిప్పని నేతగా ఆంధ్రప్రదేశ్ లో సుభిక్ష పరిపాలనను అందిస్తున్నారని రామ మనోహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖా మాత్యులు మేకపాటి. గౌతం రెడ్డి ఆశీస్సులతో పాదయాత్రను ప్రారంభించగా ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి.రాజమోహన్ రెడ్డి, యం.యల్.ఏ మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి అనుయాయులు తమ పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికి తేనీటి విందును అందించడం మరుపురాని అనుభూతిగా రామ మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం రాత్రికి స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిధిగృగంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ కార్యక్రమాలలో రామ మనోహర్ రెడ్డి సన్నిహితులు మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామానికి చెందిన మల్లు.శ్రీనివాసులురెడ్డి, ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన చేజర్ల.జయరామిరెడ్డి, జె.జె పేటకు చెందిన సుబ్బరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
• Valluru Prasad Kumar
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
• Valluru Prasad Kumar
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
• Valluru Prasad Kumar
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్ను నియమిస్తూ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్గా నియమితులైన రఘురాజ్ రాజేంద్రన్ మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన (2004 బ్యాచ్) ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్కు చెందిన ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి మంగేశ్ గిల్దియాల్ పీఎంవో అండర్ సెక్రటరీగా నియమితులయ్యారు.
• Valluru Prasad Kumar
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn