*నందిగుంటలో ఉపాధిహామీ పనులు తనిఖీ* వింజమూరు, జూన్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ పరిసరాలలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను మంగళవారం ఉదయం యం.పి.డి.ఓ ఎస్.కనకదుర్గా భవాని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీనియర్ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద ఉన్న మస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మస్టర్లలో నమోదు చేసి ఉన్న పేర్లు ప్రకారం కూలీల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా యం.పి.డి.ఓ మాట్లాడుతూ జాబ్ కార్డులు కలిగి ఉన్న వారినే పనులలోకి అనుమతించాలని, ఒకరికి బదులు మరొకరితో ఉపాధిహామీ పనులు చేయించిన పక్షంలో ఉపేక్షించేది లేదని ఫీల్డ్ అసిస్టెంట్లును హెచ్చరించారు. గ్రామాలలో వలసలను నివారించేందుకు గానూ అర్హులైన ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేస్తూ నూతనంగా జాబ్ కార్డులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని పనులు చేసే సమయంలో కూలీలు భౌతికదూరం పాటించాలన్నారు. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని కూలీలకు విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రతను బట్టి కూలీల సం రక్షణ దిశగా ఎన్.ఆర్.ఇ.జి.యస్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలుగా శుద్ధి జలాలు, నీడను కల్పించే పట్టలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కూలీల శ్రమకు తగిన ఫలితాలనిచ్చే దిశగా ఖచ్చితమైన కొలతలను రికార్డులలో పొందుపరచాలని సిబ్బందికి సూచించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు