*కిడ్నీల వ్యాధిగ్రస్థునికి ఆర్ధిక సాయం* వింజమూరు, జూన్ 17 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని జువ్విగుంటపాళెం ఎస్.టి కాలనీకి చెందిన మురళి అనే కిడ్నీల వ్యాధిగ్రస్థునికి బుధవారం సాయంత్రం జిల్లా బి.జె.పి ఉపాధ్యక్షుడు యల్లాల.రఘురామిరెడ్డి 5 వేల రూపాయల ఆర్ధిక సహాయమును అందజేశారు. మురళికి గత యేడాది క్రితం రెండు కిడ్నీలు చెడిపోవడంతో హాస్పిటల్ కు వెళ్ళి తాత్కాలికంగా వైద్యం చేయించుకున్నారు. అయితే పూర్తిగా కోలుకునేందుకు అధిక మొత్తంలో నగదు ఖర్చవుతుందని డాక్టర్లు వెల్లడించడంతో ఆర్ధిక స్థోమత లేని మురళి కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. ఈ నేపధ్యంలో మురళి కుటుంబసభ్యుల అవస్థలను తెలుసుకున్న వింజమూరు వాసి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ ఫ్రొఫెసర్ డాక్టర్ వై.వి.రామిరెడ్డి స్పందించారు. వింజమూరులోని తన సోదరుడు యల్లాల.రఘురామిరెడ్డి ద్వారా బాధిత కుటుంబానికి నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రఘురామిరెడ్డి వెంట మండల బి.జె.పి టెక్నికల్ కమిటీ కన్వీనర్ మూల.బాలక్రిష్ణారెడ్డి ఉన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు