చైనా కుట్రలకు మోదీ మౌన మెల : ఏపీసిసి సమన్వయ కమిటి సభ్యురాలు సుంకర పద్మశ్రీ విజయవాడ జూన్ 18 (అంతిమ తీర్పు) : దేశ రక్షణకై మన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరికొంత మంది వీర మరణం పొందారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర సైనికులకు అశ్రునివాలి అర్పిస్తున్నాం .మా దేశ సైనికులను చంపడానికి, నా దేశ భూభాగాన్ని అక్రమించుకోవడానికి చైనాకు ఎంత ధైర్యం ?. చైనా కుట్రలు చేసి సైనికులను చంపుతూ ఉంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 19న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడంలో ప్రధాని మోదీ బిజీబిజీగా ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా మనం ఏం చర్యలు తీసుకుంటామో ప్రజలకు చెప్పాలి. ఎన్నికల ముందు ఇలాగే దాడులు జరిగితే సైనికుల కోసం తాను పోరాటం చేస్తాను సైనికుల జోలికి వస్తే తన ఛాతీ 56 అంగుళాలు ఉప్పొంగుతుంది ఉద్వేగంతో ప్రసంగాలు చేసిన మోదీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు. ప్రధాని మోదీ బయటకు వచ్చి 56 అంగుళాల ఛాతీ చూపించాలి. దేశంలో ఏ ప్రధాని తిరగనన్ని దేశాలు తాను తిరిగానని మోదీ చెబుతూ ఉంటారు. మహత్మగాంథీ, నెహ్రు , ఇందిర గాంది తో పొల్చూకొవాలని ప్రధాని మోదీ, అతని అనుచరులు తాపత్రయపడుతుంటారు .గత కొన్ని దశబ్దాలుగా పాకిస్తాన్ తో మనకు వైరం ఉంటే స్నేహపూర్వక సంబధాల పేరుతో ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని పుట్టినరోజుకు ఆహ్వనం లేకపోయిన హాజరవుతారు. చైనా ప్రధానిని ఇండియాకు ఆహ్వనించి బోజనం పెట్టి పంపిస్తారు.ఇదే చైనా మన భారతీయ భూబాగాన్ని అక్రమించుకుని, మన సైనికుల ప్రాణాలను తీసింది..నేపాల్ కూడా కాలు దువ్వుతుంది .విదేశాంగ ,రక్షణ శాఖ ,నిఘా విబాగంలో లోపాలు ఉన్నట్లు కనిపిస్తోంది. మన పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు , పరిణామాలపై ప్రదాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలి.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు