*వింజమూరు-కలిగిరి మార్గంలో రోడ్డు ప్రమాదం* ఒకరు మృతి... వింజమూరు, జూన్ 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు-కలిగిరి ప్రధాన మార్గంలో కావలి-కడప మెయిన్ రోడ్డుపై కలిగిరి మండలంలోని నాగసముధ్రం పంచాయితి పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కలిగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవికిరణ్ అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన పెంచలయ్య అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. సంఘటన జరిగిన తీరును బట్టి పెంచలయ్య ద్విచక్ర వాహనంపై నుండి పడిపోయి చనిపోయాడా లేక ఏదైనా వాహనం ఢీకొని మృతి చెందాడా అనే విషయం దర్యాప్తులో వెల్లడి కావల్సి ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ రాత్రి 7:30 గంటల సమయంలో ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. ఆయా మార్గాలలో అదే సమయంలో ప్రయాణించిన వాహనాలను సి.సి కెమెరాల పుటేజీల ఆధారంగా పరిశీలించనున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా సి.ఐ వెంట కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వారి సిబ్బంది ఉన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు