*సచివాలయాలను సందర్శించిన తహసిల్ధారు* వింజమూరు, జూన్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండల కేంద్రంలోని పలు సచివాలయాలను సోమవారం నాడు తహసిల్ధారు యం.వి.కే సుధాకర్ రావు సందర్శించి సచివాలయాల సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు సులభతరమైన పాలనను అందించే దిశగా సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా మీ-సేవా కేంద్రాల ద్వారా అందించే సేవలన్నింటినీ గ్రామ సచివాలయాలకు బదలాయించడం జరిగిందన్నారు. పారదర్శక పాలన దిశగా ఆయా గ్రామాలలోని సచివాలయాల ద్వారానే ప్రభుత్వ సేవలను ప్రజలు స్థానికంగానే పొందే వెసులుబాటు ఉందన్నారు. సచివాలయాల ప్రాధాన్యతను పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియపరిచేందుకు సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన అధికశాతం పనులు నేరుగా సచివాలయాల ద్వారానే అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ఒక నిర్ధిష్టమైన వ్యవస్థను రూపొందించిందన్నారు. పాసు పుస్తకాలు, అడంగళ్ళు, కుల, ఆదాయ సర్టిఫికేట్లు తదితరాల మీ-సేవా సర్వీసులన్నింటినీ ప్రజలు ఆయా ప్రాంతాలలోని సచివాలయాల ద్వారానే పొందవచ్చునని తహసిల్ధారు తెలిపారు. గ్రామ రెవిన్యూ కార్యదర్శులు సైతం నిత్యం సచివాలయాలలోనే ప్రజలకు అందుబాటులో ఉండి రెవిన్యూ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరింపజేయాలని ఆదేశించారు. కనుక ప్రజలందరూ కూడా సచివాలయాలలో అందించే సేవల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి ఆయా గ్రామాలలో, ప్రాంతాలలో నెలకొల్పిన సచివాలయాల ద్వారా తమ తమ పనులను పూర్తి చేసుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పించిందన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు