ర్యాంపులకు 5 కి.మీ లోపు ఉచితంగా ఇసుక విజయవాడ : ర్యాంపులకు 5 కి.మీ లోపు గ్రామాల ప్రజల అవసరాలకు ఎద్దుల బండిపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ఇసుక రవాణాపై మైనింగ్‌ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. నదీ పరివాహక ప్రాం తంలోని గుర్తించిన 118 గ్రామాలకు ఈ అవకాశం ఉందన్నారు. ఇసుక నిల్వ చేసినా, అమ్మినా జరిమానా విధిస్తామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతీరోజూ మూడు వేల కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. కొవిడ్‌-19 ఆసుపత్రులు, వైద్య పరీక్షల నిర్వహణపై వైద్యాధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పాజిటివ్‌ కేసుల అడ్మిషన్‌, డిశ్చార్జ్‌ వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా పంపాలన్నారు. జేసీలు శివశంకర్‌, మోహన్‌కుమార్‌, డీఆర్వో ప్రసాద్‌ పాల్గొన్నారు. గ్రామ సచివాలయల నిర్మాణాల్లో వేగం పెంచాలని పంచాయతీ రాజ్‌శాఖ ఇంజనీర్లను కలెక్టర్‌ ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలతో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయితీరాజ్‌ శాఖకు అప్పగించిన 811 గ్రామ పంచాయతీల నిర్మాణ పనులను ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 801 రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కూడా ఈ నెలాఖరుకు ప్రారంభించాలన్నారు. జేసీ మోహన్‌కుమార్‌, జడ్పీ సీఈ వో సూర్యప్రకాష్‌, సర్వశిక్షాభియాన్‌ ఏసీపీ రవీంద్రబాబు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు