ప్రతిరోజూ గంటపాటు విద్యుద్దీపాలను ఆపివేస్తాం : సుంకర పద్మశ్రీ విజయవాడ : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న ఆనాలోచిత, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టిందని ఏపీసీసీ సమన్వయ కమిటి సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. సీఆర్డీఏ రద్దు మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదంపై సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల జీవితాల్లో చీకటి నింపినందుకు ప్రతిరోజు గ్రామాలలో గంటపాటు విద్యుద్దీపాలని ఆపేయాలని నిర్ణయించుకున్నామన్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో విద్యుత్ దీపాలు ఆపివేస్తామని పద్మశ్రీ తెలిపారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద నుంచి అసెంబ్లీకి వెళ్లే దారి మొత్తం కూడా నల్ల జెండాలను కట్టి నిరసన తెలియజేస్తామన్నారు. కరోనా కారణంగా 60 రోజుల నుంచి ఆగామని.. రేపటి నుంచి అమరావతి జేఏసీ మహిళల మందరం కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే దాకా ఉద్యమం తీవ్రతరం చేస్తామని సుంకర పద్మశ్రీ తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు