*వింజమూరులో సీనియర్ మేట్ పై సస్పెన్షన్ వేటు* అంతిమ తీర్పు న్యూస్ కు స్పందన..... వింజమూరు, జూలై 10 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): గ్రామాలలో వలసలను నివారించి పేద ప్రజలకు కూడు, గుడ్డ, నీడ కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైపు కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తుండగా పలువురు అడ్డగోలుగా ఆ నిధులను దిగమింగేందుకు దొడ్డిదారిన చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టకేలకు వింజమూరు యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ చెక్ పెట్టి ఉపాధిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయిందని వింజమూరు పంచాయితీ పరిధిలో ఉపాధిహామీ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే వింజమూరులోని పాతూరుకు చెందిన ఉపాధిహామీ మాలకొండస్వామి, పద్మనాధ గ్రూపులకు చెందిన ఉపాధిహామీ కూలీలు గురువారం నాడు యం.పి.డి.ఓ కార్యాలయానికి వచ్చి తాము ఉపాధిహామీ పనులలో కాయకష్టం చేస్తున్నా తమ శ్రమకు తగిన ఫలితం రాకపోగా వారాంతానికి 206 రూపాయలు, 149 రూపాయలు, అంతకంటే దారుణంగా మా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని యం.పి.డి.ఓకు మొర పెట్టుకున్నారు. తక్షణమే స్పందించిన ఆమె ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ ఇంచార్జ్ ఏ.పి.ఓను పిలిపించి చిచారణకు ఆదేశించారు. విచారణలో సదరు మేట్ బోయిన.రమణయ్య ఉపాధిహామీ పనుల విషయంలో తన స్వార్జితం చూసుకుంటున్న విషయాలు భాధిత కూలీల ద్వారా ఆమె దృష్టికి రావడంతో వెనువెంటనే సదరు మేట్ పై చర్యలు తీసుకున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు