*నెల్లూరు కేంద్రంలో ఐసోలేషన్ బెడ్లు ఖాళీ లేవా...? వింజమూరులోనే పాజిటివ్ సోకిన యువకుడు....భయాందోళన చెందుతున్న ప్రజలు....అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు..... వింజమూరు, జూలై 13 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ నియంత్రణ విషయంలో నిరంతరం కృషి చేస్తున్నామని పదే పదే ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. సాక్షాత్తూ కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని నెల్లూరులోని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచకుండా వింజమూరులో బాధితుడి స్వగృహానికే తరలించి సంబంధిత అధికారులు తమ రాజనీతిని చాటుకున్న వైనమిది. అధికారుల తీరు పట్ల ప్రజలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే గతంలో పలు మండలాలలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం నిర్వహించిన మాజీ అధికారి కుమారుడు ఇతర రాష్ట్రం నుండి వస్తుండగా అతనికి విజయవాడలో అక్కడి అధికారులు కరోనా టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. అయితే రిపోర్టులలో సదరు యువకుడికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ జరిగింది. వింజమూరులో ఉన్న ఆ యువకుడిని వెంటనే జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇక్కడి అధికారులు ఏం చేశారో తెలుసా.... అంబులెన్సులో పాజిటివ్ సోకిన వ్యక్తిని నెల్లూరుకు తరలించి అక్కడ ఐసోలేషన్ వార్డులు ఖాళీ లేవని, బెడ్లు లేవని తిరిగి వింజమూరులోని స్వగృహానికి బాధితుడిని తరలించారు. ఈ పరిణామంతో స్థానిక ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. సంబంధిత అధికారుల వ్యవహారశైలిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే నానా హడావిడి చేసి బాధితులను ఆసుపత్రులకు తరలిస్తున్న అధికారులు ఏకంగా కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఇంట్లోనే ఉంచడంలో ఆంతర్యమే


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు