*మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారుల విచారణ* వింజమూరు, జూలై 14 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో గతంలో జరిగిన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు సంబంధించి అధికారులు లోతుగా విచారణ సాగిస్తున్నారు. డ్వామా కార్యాలయం నుండి మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టేందుకు ముందస్తుగా 13 లక్షలా 95 వేల రూపాయల నిధులను విడుదల చేసియున్నారు. వాటిని కొంతమంది నేచురల్ లీడర్లు నిర్మాణ పనులను చేజిక్కించుకున్నారు. వారిలో కొంతమంది నాసిరకంగా మరుగుదొడ్లును నిర్మించగా మరికొంత మంది అసలు నిర్మాణాలు చేపట్టకుండానే ఆ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు, ఫిర్యాధులు అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కనకదుర్గా భవానీ ఉన్నతాధికారుల సూచనల మేరకు స్వయంగా రంగంలోకి దిగి లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ పరిణామంతో అటు బదిలీపై వెళ్ళిన అధికారులు, ఇటు నేచురల్ లీడర్లులో గుబులు మొదలైంది. అందుకు సంబంధించి పలువురికి నోటీసులు కూడా జారీ చేశారు. దుర్వినియోగం కాబడిన నిధులను యుద్ధ ప్రాతిపదికన రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసే దిశగా యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ చర్యలు చేపడుతున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న పలువురు యం.పి.డి.ఓ తీరును ప్రశంసిస్తున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు