*రాజగృహంపై దాడికి ప్రజా సంఘాల నిరసన* వింజమూరు, జూలై 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): డా.బి.ఆర్.అంబేద్కర్ రాజగృహం పై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల ఆద్వర్యంలో వింజమూరు మండలంలోని అరుంధతివాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసీసి సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి .పందిటి అంబేద్కర్ మాదిగ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగపట్ల వెంగయ్య వారు మాట్లాడుతూ భారతరాజ్యంగ నిర్మాత ఇంటిపై జరిగిన దాడి అమానుషం అని అన్నారు ఈ దేశానికి దశా దిశా నిర్దేశించిన మహానాయకుడు అంబేడ్కర్ అని, ఆయన ఇంటికే రక్షణ లేకుండా పోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . అలాగే డా. అంబేద్కర్ గారి వారసులందరికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే దాడి చేశారొ వారిపై రాజద్రోహం కేసు నమోదు వేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రొడ్డా పేతురు, గంగపట్ల మురళి , వర్ల తిరుమలేష్, టౌన్ అధ్యక్షుడు మల్లెల తిరుమలేష్ , గంగపట్ల అజయ్, గంగపట్ల జ్ఞాన కుమార్, శివకుమార్, జి శ్రీను, రాకేష్, పి.వెంగళరావు, పి.కొండలరావు, వెంకటకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు
Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
• Valluru Prasad Kumar
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
• Valluru Prasad Kumar
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
• Valluru Prasad Kumar
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
• Valluru Prasad Kumar
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn