*కోవిడ్-19 పై వాలంటీర్ చే అవగాహనా సదస్సు* వింజమూరు, జూలై 12 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో మజరా గ్రామమైన బొమ్మరాజుచెరువులో కరోనా వైరస్ నియంత్రణకు గ్రామ వాలంటీర్ తెలదాల.రవి ఆదివారం సాయంత్రం గ్రామస్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ ఆదేశాలు, సూచనల మేరకు గ్రామస్థులు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు గానూ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా స్థానిక రామాలయం వద్ద నిర్వహించిన ఈ అవగాహనా సదస్సులో గ్రామంలో ప్రజలు అరుగులు మీద గుంపులు గుంపులుగా ఉండరాదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తాము గతంలో ఇంటింటికీ పంపిణీ చేసిన మాస్కులును గానీ స్వతహాగా సమకూర్చుకున్న మాస్కులను గానీ ధరించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ వీలైనంత వరకు మనిషికి మనిషికి మధ్య కొంతదూరం ఉండే విధంగా మసులుకోవడం శ్రేయస్కరమన్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. తుమ్మినా, దగ్గినా చేతి రుమాలును అడ్డు పెట్టుకుంటే మంచిదన్నారు. తరచూ శానిటైజర్లను వినియోగించడం అలవాటు చేసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత అత్యంత ఆవశ్యకమన్నారు. ఇప్పటివరకు నియంత్రణా మందు లేని ఈ వ్యాధికి ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన మందు అని వాలంటీర్ రవి తెలియజేశారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నా, ఇతర కరోనా ప్రభావిత ప్రాంతాల నుండి ఎవరు వచ్చినా వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు