*సచివాలయాలను తనిఖీ చేసిన తహసిల్ధారు* వింజమూరు, జూలై 3 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మేజర్ పంచాయితీలోని గ్రామ సచివాలయాలను శుక్రవారం నాడు తహసిల్ధారు సుధాకర్ రావు తనిఖీ చేశారు. 1,2,3,4 సచివాలయాలకు వెళ్ళిన ఆయన రికార్డులను పరిశీలించారు. ప్రధానంగా మూవ్ మెంట్ రిజిష్టర్లును పక్కాగా నిర్వహించాలని సచివాలయాల ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్ధారు మాట్లాడుతూ ప్రజలకు మరింతగా క్షేత్ర స్థాయిలో సేవలందించేందుకు ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సచివాలయాలలోనే ప్రజలకు అవసరమైన సేవలను పొందవచ్చునన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రధాన కార్యాలయాలకు రాకుండానే సచివాలయాలకు వెళ్ళి అక్కడి సిబ్బందికి తమ తమ సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత గడువులోగా ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమాలలో మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, నాగిరెడ్డి, ప్రవీణ, నరేంద్ర తదితరులున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు