*ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలి* పల్లాపు. అరుణ.... వింజమూరు, ఆగష్టు 25 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): రెగ్యులరైజ్, చట్టబద్దమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తమ పట్ల దృష్టి సారించాలని మండల ఆశా వర్కర్ల సంఘం యూనియన్ అధ్యక్షురాలు పల్లాపు. అరుణ కోరారు. అలుపెరగని విధి నిర్వహణలో భాగంగా అభద్రతా భావంతో పనిచేయాల్సిన దుర్బర పరిస్థితులు ఆశా వర్కర్లను వెన్నంటి వేధిస్తున్నాయని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల (2018-19, 2019-20, 2020-21) యూనిఫాం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నెలకు 1000 రూపాయలు జనవరి నుండి జూన్ వరకు చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తర్వాతే ఆశాలను రిటైర్మెంట్ చేయాలని, లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా సగం పెన్షన్ ఇవ్వాలన్నారు. పర్మినెంట్ పోస్టుల భర్తీలో ఆశాలకు వెయిటేజ్ ఇవ్వడంతో పాటు సం క్షేమ పధకాలు ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి నెలకు 7,500 రూపాయలు, ఒక్కొక్కరికి నెలకు 10 కిలోల బియ్యం 6 నెలల వరకు సరఫరా చేయాలన్నారు. అంతేగాక ప్రస్తుత కరోనా కాలంలో ఆశా వర్కర్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టి రెడ్ జోన్స్, ల్యాబ్స్, క్వారంటైన్స్, ఆసుపత్రులలో డ్యూటీలు చేయడం జరిగిందన్నారు. విధుల్లో ఉన్నవారందరికీ పి.పి.ఇ కిట్లు అందజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కోవిడ్-19 డ్యూటీ ప్రత్యేక అలవెన్స్ 10,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు 95 మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అవసరమైన మేరకు అందజేయాలన్నారు. మార్చి 15 తర్వాత మరణించిన ఆశాలకు భీమా సౌకర్యం కల్పించాలని, వారి కుటుంబంలో ఒకరికి ఆశా ఉద్యోగమివ్వాలని, కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేంత వరకు భీమా కాలాన్ని పొడిగించాలన్నారు. సెల్ ఫోన్స్ ప్రభుత్వమే ఇవ్వాలని, ఫోన్లు కొనాలనే అధికారుల వేధింపులు ఆపాలన్నారు. రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు పని భధ్రత, పని గంటలు, సెలవులు లేవన్నారు. ప్రమాదం జరిగితే భీమా సౌకర్యం లేదని, మెటర్నిటీ సౌకర్యం లేదన్నారు. ఈ.ఎస్.ఐ, పిఎఫ్ లేదని, అనారోగ్యం పాలయితే వైద్య సౌకర్యాలు గగనమని, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రకమైన సౌకర్యాలు లేకుండానే ఆశాలు పని చేస్తున్నారన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని పల్లాపు. అరుణ విజ్ఞప్తి చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు